Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పరువునష్టం కేసులోరాహుల్‌కు బెయిల్‌

బెంగళూరు: పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. వార్తా పత్రికల్లో కాంగ్రెస్‌ పరువునష్టం కలిగించే ప్రకటనలు జారీ చేసిందని ఆరోపిస్తూ బీజేపీ కర్నాటక శాఖ దావా వేసింది. విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్‌ కోర్టుకు హాజరయ్యారు.
గత బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో 40 శాతం కమీషన్‌ వసూలు చేసినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిందని, ‘40 శాతం కమీషన్‌ ప్రభుత్వం’గా అభివర్ణిస్తూ పత్రికల్లో పెద్దఎత్తున ప్రకటనలు గుప్పించిందని పేర్కొంటూ బీజేపీ నేత కేశవ్‌ ప్రసాద్‌ ఆ పార్టీ తరపున గతంలో పరువు నష్టం దావా వేశారు. వివిధ రకాల ఉద్యోగాలకు బీజేపీ ‘రేటు కార్డులు’ పెట్టిందంటూ కాంగ్రెస్‌ పార్టీ పోస్టర్లు అతికించిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇదివరకు విచారణ జరిపిన బెంగళూరులోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు బెయిల్‌ మంజూరు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img