సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్
విశాలాంధ్ర,కదిరి.(శ్రీ సత్య సాయి జిల్లా):- రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారి మృతి తెలుగు సమాజానికి తీరని లోటని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ సత్యసాయి జిల్లా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ పేర్కొన్నారు.ప్రజా పక్షపాతి, అలుపెరుగని అక్షర యోధుడికి నివాళులు అర్పించారు. జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో పనిచేసిన రామోజీరావు మనకు మార్గదర్శి అని ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు ఉద్యమస్ఫూర్తి
తో పని చేశారని ఆయన సేవలను కొనియాడారు. జర్నలిజ రంగంలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన పాత్రికేయ దిగ్గజం రామోజీ రావు గారని తెలిపారు