…. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : చోడవరం టి.డి.పి. కూటమి ఎమ్మెల్యే
కె.ఎస్.ఎన్.ఎస్. రాజును నియోజకవర్గ మీ సేవ ఆపరేటర్లు ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో శనివారం కలసి అభినందనలు తెలియజేశారు. అనంతరం మీసేవ ఆపరేటర్లు గత ఐదేళ్లుగా పడిన ఇబ్బందులను ఎమ్మెల్యే కు విన్నవించారు. వారితో ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ మీసేవ ఆపరేటర్ల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర లో టి.డి.పి.అధ్యక్షుడు లోకేష్ ఇచ్చిన మాటని నెరవేర్చేలా చూస్తానన్నారు. మీ సేవ మరియు ఆపరేటర్లు పడుతున్న ఇబ్బందులను సీ.ఎం. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో రోలుగుంట, రావికమతం, బుచ్చయ్యపేట, చోడవరం మండలాలకు చెందిన మీసేవ ఆపరేటర్లు ఎం వి హెచ్ ప్రసాద్, అనంతపల్లి శ్రీను, బైన భవాని శంకర్, అప్పారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు..