రోటరీ క్లబ్ క్యాంపు నిర్వహకులు, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణ గ్రామీణ ప్రాంతాలలో గల ప్రజలకు ఉచిత వైద్య సేవలు చేయడమే మా రోటరీ క్లబ్ లక్ష్యము అని క్యాంపు నిర్వహకులు, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్-ధర్మవరం, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ వెంకట రమణమ్మ జ్ఞాపకార్థం, మామిళ్ళ రంగనాయకులు వారి కుటుంబ సభ్యులు- శ్రీ చౌడేశ్వరి దేవి సిల్క్స్ ధర్మవరం వారు నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో 170 మంది కంటి రోగులు పాల్గొనగా ఇందులో 117 మంది కంటి ఆపరేషన్ కు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ ఉచిత రవాణా తో పాటు ఉచిత ఆపరేషన్లు, ఉచిత కంటి అద్దాలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఈ సంవత్సరం దాదాపుగా 1700 మందికి పైగా శిబిరాలను నిర్వహించి కంటి శాస్త్ర చికిత్స నిర్వహించడం జరిగిందని తెలిపారు. సీనియర్ రోటరీ క్లబ్ సభ్యులు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ 1994 నుండి ఇప్పటివరకు దాదాపుగా 34 వేల మందికి పైగా ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. దాత మామిళ్ళ రంగనాయకులు మాట్లాడుతూ శిబిరమునకు వచ్చిన వారందరికీ డాక్టర్ల యొక్క సూచనలు సలహాలు తప్పక పాటించాలని తెలిపారు. ఇటువంటి శిబిరాల యొక్క సమాచారాన్ని తమ తమ గ్రామాలలో, పట్టణాలలో అందరికీ తెలియజేసి కంటి వెలుగును ప్రసాదించేలా సహకారం అందించాలని తెలిపారు. ఈ క్యాంపునకు క్యాంపు చైర్మన్ కృష్ణమూర్తి నిర్వహించి, రోగులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి డాక్టర్ సౌరవ్ పాటిల్, డాక్టర్ సర్జన్ జైన్ వారు వివరించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ శిబిరంలో రెటీనా పరీక్షలు కూడా నిర్వహించడం జరిగిందని, దీని ద్వారా కంటి చూపు యొక్క నాణ్యత వెంటనే కనుగొనే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం దాతలను, శంకరా కంటి ఆసుపత్రి డాక్టర్లను, కోఆర్డినేటర్లను ఘనంగా శాలువాతో రోటరీ క్లబ్ వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సోలిగాల్ల వెంకటేశులు, సత్రశాల ప్రసన్నకుమార్, బివి చలం, శివయ్య ,కొండయ్య, శంకర కంటి ఆసుపత్రి- బెంగళూరు కోఆర్డినేటర్ శివ ప్రకాష్, రామిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.