విజయనగరం జిల్లా. రాజాం :
- నూతన క్యాబినెట్ కు శుభాకాంక్షలు
- నిరుద్యోగులకు మెగా డీఎస్సీ వరం
- ప్రజలు సంక్షేమం – రాష్ట్రాభివృద్దికే ప్రాధాన్యం
- జిల్లా బి సి సెల్ అధికార ప్రతినిధి మరిపి. జగన్ మోహన్ నాయుడు.
రాజాం,14.6.24:
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేయడంతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తం అవుతుందని విజయనగరం జిల్లా బి సి సెల్ అధికార ప్రతినిధి మరిపి. జగన్ మోహన్ నాయుడు అన్నారు.
రాష్ట్ర మంత్రులు గా ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్, లోకేష్ కి,కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణికి,ఇతర మంత్రి వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎన్ డి ఏ కూటమీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 16,347 డీఎస్సీ పోస్టులు భర్తీకి మొదటి సంతకం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ దస్త్రాలు పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకాలు చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సారధ్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకే ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.