విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న డయాబెటిస్, బి.పి. సహా 54 రకాల ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం అమాంతంగా పెంచేసింది. మధుమేహం రోగులు ఎక్కువగా వినియోగించే మెట్ఫార్మిన్, లినాగ్లిష్టిన్, సిటాగ్లిష్టిన్ రేట్లను రూ.15 నుండి రూ.20లకు పెంచింది. బి.పి. నియంత్రణకు వినియోగించే టెల్మిస్తార్టిన్, క్లోర్థాలిడిన్, సిల్ని డిఫైన్ మందులను రూ 7 నుండి రూ.14కు సవరించింది. యాంటి బాక్టీరియల్ ఇంజెక్షన్ సిప్రొఫ్లోక్సాసిస్, కాల్షియం, విటమిన్ డి 3 మందుల ధరలు విపరీతంగా పెరిగాయి.