ఎంఈఎఫ్. జాతీయ నేత బండారు శంకర్
విశాలాంధ్ర ధర్మవరం:: జూలై 7న వరంగల్లో నిర్వహించబడే మాదిగల ఆత్మ గౌరవ ప్రవార్తను విజయవంతం చేయాలని ఎం ఈ ఎఫ్ జాతీయ నేత, అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో లక్షలాది మంది మాదిగలతో జూలై 7 న వరంగల్ లో ” మాదిగల ఆత్మగౌరవ కవాతుకు పెద్ద ఎత్తున మాదిగలు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగల జీవితాల్లో మార్పు వస్తుందని,మాదిగలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.2024 ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపైన విచారణ జరిగింది అని, త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై అంతిమ తీర్పు రాబోతున్నది అని, తద్వారా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి వీలవుతుందని అన్నారు. ఛలో వరంగల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రచారం నిమిత్తం తాను ధర్మవరం పట్టణంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత కేశగాల్ల శ్రీనివాసులు, ఎం ఈ ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాకేత్ మధు సూదన్, నేతలు కొండప్ప, కొడవండ్ల నారాయణ స్వామి, వెంకటేష్, లక్ష్మి నారాయణ, శేషు, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.