సంగీత గాయకురాలు పొలమడ సత్యదీప
విశాలాంధ్ర- ధర్మవరం ; చాలా నచ్చింది నా మనసును కుదట పరిచే అమ్మ జోల పాట వంటిదే సంగీతం అని సంగీత గాయకురాలు పొలమడ సత్య దీవ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ సంగీత దినోత్సవం యొక్క ప్రాధాన్యత, సంగీతంలోని పలు విషయాలను సంగీత కళాకారులకు వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ చతుర్వేదంలోని మూడవదైన సామవేదంలోని ఒక భాగమే సంగీతము అని అంటారని తెలిపారు. గీతము అనగా పాడుట సంగీతము అనగా శృతిలయలతో మంచిగా పాడుట అని అర్థం. ప్రతి మనిషికి ఉల్లాసము, ఉత్తేజములతో మనసును ఆహ్లాదపరుస్తూ తన్మయ తత్వాన్ని ఇచ్చే సరిగమపదనిసలను వివరంగా తెలిపారు. సంగీత శాస్త్రము అనేకమంది వాగ్దేవికాలను, పితామహులు, ప్రచారకులు జనంలోకి భక్తి తత్వాన్ని పెంచిన ఎందరో మహానుభావులకు సంగీత దినోత్సవం అంకితం చేయడం జరిగిందని తెలిపారు. తాను ఎంతో మందికి సంగీత శిక్షణను ఆన్లైన్ ద్వారా ఇస్తూ, రచయిత్రిగా, వీణ వాదినిగా, డాక్టర్ నంది అవార్డు, ఆధ్యాత్మిక రత్న, నేషనల్ సేవారత్న, శ్రీ వాసవి సేవా రత్న అను పురస్కారములను అవార్డులను పొందడం జరిగిందని తెలిపారు. సరిగమపదనిస ఈ శ్రద్ధ స్వరములను జీవజాలం నుంచి గ్రహించిన మహర్షులు ప్రసాదించిన సంగీత శాస్త్రము అనేకమంది వాగ్గేయకారులు, పితామహులు, ప్రచారకులు ప్రజల్లోకి భక్తి తత్వాన్ని పెంచడం జరిగిందని తెలిపారు. తాను రాష్ట్రంలోని జిల్లావ్యాప్తంగా పలు దేవాలయాలను సంగీత కచేరీలు, వాటి ప్రాధాన్యతలను వివరించడం జరుగుతున్నదని తెలిపారు. కావున ప్రతి తల్లిదండ్రులు, తమ పిల్లలకు సంగీతమును నేర్పుతూ భారతీయ సంస్కృతి కలలను విస్తరింప చేయాలని వారు తెలిపారు.