విశాలాంధ్ర – యస్. రాయవరం : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనిదిని పాయకరావుపేట నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సోమవారం వైయస్. రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండల కేంద్రం లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, 108 వంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షులు బొలిశెట్టి గోవిందరావు, జడ్పిటిసి కాకర దేవి, ఎంపీపీ కోన లోవ లక్ష్మి, వైసిపి సీనియర్ నాయకులు కొణతాల శ్రీనివాసరావు, శ్రీపతి రాజు, మధువర్మ, రామచంద్ర రాజు, అల్లాడ నాగరాజు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో 1