కళాశాల ఆవరణ గార్డెన్ లో మొక్కలు నాటుతున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ లీలా పావని
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రతి విద్యార్థి విద్యాలయాన్ని దేవాలయంగా భావించి కళాశాలలోనే గాక కళాశాల బయట పరిసరాలను శుభ్రంగా చూడముచ్చటగా ఉంచుకునేందుకు కృషి చేయాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ కే లీలా పావని అన్నారు. కోటి అధ్యాపకులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో కలిసి గురువారం ఆమె కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన గార్డెన్ లో పలు రకాల పూల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల పరిసరాలను పలు రకాల పూల మొక్కలతో గార్డెన్ గా తయారు చేయడం వలన కళాశాల మంచి ఆకర్షణగా కనిపించడమే గాక, కళాశాలలో విద్యను అభ్యసించేందుకు విద్యార్థినీ విద్యార్థులకు, కళాశాలలో విధులు నిర్వర్తించే అధ్యాపకులు ప్రతి ఒక్కరికి కళాశాల పరిసరాలు ఆహ్లాదకరంగా కనిపించడంతోపాటు కళాశాలలో ఉండి విద్యను అభ్యసించేందుకు విద్యార్థినీ విద్యార్థులకు కూడా కళాశాలలో ఉండి విద్యను అభ్యసించేందుకు ఉత్సాహం కలుగుతుందని తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు పరిస్థితులు దోహదపడతాయని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ రమణ, కే సంతోషి, రవీంద్ర నాయక్, జగదీష్ బాబు, బాలరాజు, ఎన్ఎస్ఎస్ బృందం వి ఈశ్వరరావు కే పూర్ణ రవు, కే రవీంద్రబాబు, పి యు వి సతీష్, నాగేంద్రబాబు, పిడి కె శివరాం కుమార్, లైబ్రేరియన్ టి జగత్రాయి, ప్రమీల, వెంకటరమణ, నాగేశ్వరరావు, శ్రీనివాసరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.