ఢాకా: బంగ్లాదేశ్లో విద్యార్థుల నిరసనలు హింసకు దారితీశాయి. ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేపట్టగా… బంగ్లాదేశ్ పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఆరుగురు విద్యార్థులు మరణించారు. 100 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు మూసివేయాల్సిం దిగా బంగ్లాదేశ్ ప్రభుత్వం బుధవారం ఆదేశించింది. విద్యార్థుల భద్రత కోసం తరగతులు నిలిపివేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు వారి హాస్టళ్లను ఖాళీ చేయించాలని కోరింది. ప్రభుత్వ అనుకూల విద్యార్థులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు వర్గాలు ఇటుకలు, రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. దీంతో నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. విద్యార్థులు అనేక ప్రాం తాల్లో రహదారులను అడ్డుకోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజధాని ఢాకా, చటోగ్రామ్, రంగపూర్ తదితర ప్రాంతాల్లో హింస చెలరేగింది. దీంతో అనేక యూనివర్సిటీల్లో పోలీసులను మోహరించారు. ఢాకా సహా ఐదు పెద్ద నగరాల్లో పారామిలటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) గస్తీ తిరుగుతున్నాయి.1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కేటాయించాలన్న డిమాండ్ విద్యార్థుల మధ్య నిరసనలకు దారితీసింది.