. 2 వేల పోస్టులకు 25 వేల మంది
. లగేజీ మోసే ఉద్యోగానికి బారులు తీరిన పట్టభద్రులు
. దేశ ఆర్థిక రాజధాని సాక్షిగా కళ్లకుకట్టిన యువత దుస్థితి
ముంబై : దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోంది. డిగ్రీలు, పీజీలు చదువుకున్నవారికి సైతం ఉద్యోగాలు దొరక్క కూలీలుగా మారిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక రాజధాని ముంబై సాక్షిగా దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో విలయతాండవం చేస్తున్నదో ఓ ఘటన కళ్లకు కట్టింది. మంగళవారం సాయంత్రం ముంబైలో జరిగిన ఓ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ 2,216 గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీ సెస్ పోస్టులకు నియామక ప్రకటన ఇచ్చింది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో భాగంగా చేయాల్సిన పని ఏంటంటే… విమానం నుంచి లగేజ్, కార్గో, ఫుడ్ సప్లయ్ను లోడిరగ్, అన్ లోడిరగ్ చేయడం. ఒక్కో విమానం నుంచి ఈ లోడిరగ్, అన్ లోడిరగ్కు ఐదుగురు లోడర్స్ అవసరం ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లోడర్స్ వేతనం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుంది. అయితే… ఈ ఉద్యోగంలో పనిచేసే వారిలో ఎక్కువ మంది అలవెన్సుల కోసం ఓవర్ టైం పనిచేసి రూ.30 వేల వరకూ సంపాదిస్తుంటారు. ఈ ఉద్యోగాలను హ్యాండీమెన్ పోస్టులు అని కూడా అంటారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ ఉత్తీర్ణులవడంతోపాటు శారీరకంగా కూడా అభ్యర్థులు దృఢంగా ఉండాలి. ఈ ఉద్యోగాల కోసం పీజీలు చేయాల్సినంత పనిలేదు. ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు 2,216 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 25వేల మందికి పైగా నిరుద్యో గులు వీటి కోసం క్యూ కట్టారు. ముంబైలోని రిక్రూట్ మెంట్ ఆఫీస్ ముందు తిండీతిప్పలు మానేసి ఉద్యోగం కోసం గంటల పాటు నిరీక్షించారు. వీళ్లలో కొందరు అస్వస్థత గురయ్యారు కూడా. పరిస్థితి ఎలా ఉందంటే.. ఎంకామ్, బీబీఏ, బీకాం చదివిన పట్టభట్టద్రులు కూడా హ్యాండీమెన్ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్లో జాబ్ సంపాదించేందుకు ముంబై కలినా విమానాశ్రయం ముందు పడిగాపులు కాశారు. కౌంటర్ల వద్ద ముందుగా దరఖాస్తులు సమర్పించాలన్న తాపత్రయంలో అభ్యర్థులు ఒకరికొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగినంత పనైంది. దీంతో పోలీసులు వచ్చి నియంత్రించారు. 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ ఉద్యోగాల కోసం ముంబైకి వచ్చిన అభ్యర్థులు కూడా ఉన్నారంటే నిరుద్యో గం యువతకు ఎంతటి శాపంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. చదివిన చదువుకు తగిన ఉద్యో గం లేక ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు డెలివరీ బాయ్స్గా వెళుతున్న వాళ్లు మన దేశంలో ఎందరో ఉన్నారు. ఈ ఒక్క ఘటనే కాదు. సరిగ్గా కొన్ని రోజుల క్రితం ఇలాంటి ఘటనే గుజరాత్ లోని బరుచ్ జిల్లాలోని అంక్లేశ్వర్లో వెలుగుచూసింది. 10 పోస్టుల కోసం 1,800 మందికి పైగా నిరుద్యో గయువత ఒక ప్రైవేట్ సంస్థముందు తొక్కుకుంటూ, తోసుకుంటూ కనిపించారు. అంతమంది ఒకేసారి తోసుకోవడంతో ఆఫీస్ రైలింగ్ కూలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ రైలింగ్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ఎవరికీ ఏం కాలేదు. దేశంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా చెప్పుకునే ముంబై, గుజరాత్లోనే నిరుద్యో గం ఈ స్థాయిలో ఉందంటే ఇక మిగిలిన రాష్ట్రా ల్లో నిరుద్యోగ యువత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు.
400 కి.మీ. ప్రయాణించి ఇంటర్వ్యూ కోసం వచ్చా….
స్త్ర ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం 400 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన బుల్దానా జిల్లా (మహారాష్ట్ర)కు చెందిన ప్రథమేశ్వర్ మాట్లాడుతూ… ‘‘నేను హ్యాండీమ్యాన్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి వచ్చాను. వారు 22,500 జీతం అందిస్తున్నారు’’ అని చెప్పాడు. ప్రథమేశ్వర్ బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగం వస్తే చదువు మానేస్తావా అని ప్రశ్నించగా… ‘ఏం చేస్తాం… ఈ స్థాయిలో నిరుద్యోగం ఉంది… మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని బదులిచ్చారు.
స్త్ర బీఏ పూర్తి చేసిన డిగ్రీని కలిగి ఉన్న మరో ఔత్సాహికుడు ఏమన్నాడంటే… తనకు హ్యాండీమ్యాన్ పని గురించి పెద్దగా తెలియదని, అయితే తనకు బతకడానికి ఉద్యోగం కావాలి అని చెప్పాడు. మరో అభ్యర్థి రాజస్థాన్లోని అల్వార్ నుంచి ముంబైకి వచ్చాడు. అతను ఎంకామ్ డిగ్రీని కలిగి ఉన్నాడు. కానీ ప్రాథమిక విద్య అవసరం ఉన్న ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ‘నేను గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను, ఇక్కడ జీతం బాగుంటుందని ఎవరో చెప్పారు. అందుకే వచ్చాను’ అని తెలిపాడు.
మోదీ పాలనలో నిరుద్యోగ పరిస్థితి దారుణం: కాంగ్రెస్
ముంబై విమానాశ్రయం వద్ద నిరుద్యోగులు వేల సంఖ్యలో బారులు తీరడంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ముంబై నార్త్`సెంట్రల్ ఎంపీ వర్ష గైక్వాడ్ స్పందిస్తూ… మోదీ పదేళ్ల ఏలుబడిలో నిరుద్యోగ పరిస్థితి దారుణంగా మారిందని తెలిపారు. మన దేశ యువకులు రష్యా, ఇజ్రాయిల్ కోసం యుద్ధాలు చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నారన్నారు. ‘‘ఎక్కడైనా ఉద్యోగాల గురించి ప్రకటన వెలువడితే… వేలాదిమంది వస్తున్నారు… తొక్కిసలాట జరుగుతుందనే భయం కలుగుతోంది’’ అని ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. హిందీ పోస్ట్లో పేర్కొంది.