చౌడుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ లలిత
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చౌడుపల్లి సర్పంచ్ గెమ్మేల. లలిత అన్నారు. ఆ పంచాయతీ కార్యదర్శి కిముడు పూర్ణచంద్రరావు అధ్యక్షతన బుధవారం చౌడుపల్లి సచివాలయం వద్ద నిర్వహించిన గ్రామసభకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని,. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే గా పాటించాలని సూచించారు. అదే క్రమంలో త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నపాటి వ్యాధులు ప్రబలిన వెంటనే గ్రామాలలోని అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, వ్యాధుల బారిన పడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తీసుకువెళ్లాలన్నారు. కాశి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడి పదార్థాలను మాత్రమే భుజించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో పంచాయతీ వార్డు సభ్యుడు కరుణానిధి, సీనియర్ నాయకుడు సింహచలం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.