బ్రెయిన్ ఫీవర్ తో మృతి చెందిందని వైద్యులు వెల్లడి
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం అనంతసాగర్ కు చెందిన రోహిణి కుమార్ సువర్ణల మూడవ సంతానమైన మోక్షజ్ఞ (ఒక సంవత్సరం వయసు) అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. కుటుంబీకులు తెలిపిన ప్రకారం వివరాలకు వెళితే రోహిణి కుమార్ సువర్ణలకు మూడవ సంతానముగా మోక్షజ్ఞ జన్మించడం జరిగింది. జన్మించిన తొలిత ఫీట్స్ రావడం జరిగిందని, అనంతరం బాబు పెరిగినప్పటి నుంచి రాలేదని, అనుకోకుండా రెండు రోజుల కిందట వాంతులు కావడం తో అనుకూలమైన చోట చూపించడం జరిగిందని, తదుపరి తగ్గకపోవడంతో బెంగళూరులో ప్రైవేట్ హాస్పిటల్కు చూపించాలన్న ఉద్దేశంతో గుంతకల్లులోని వారి బంధువుల ఇంటి నుండి వారు కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు ఉలుకు పలుకు లేకపోవడంతో హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇప్పటికే మృతి చెందిన బాబుకు బెంగళూరులోని హాస్టల్ సిఎంపి హాస్పిటల్ లో 10 లక్షలు, బెంగళూరు ఉదయ హాస్పిటల్ లో ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసిన బాబు బతకలేదని తాత ఆవేదన వ్యక్తం చేశాడు. తండ్రి బెంగళూరులో ఓ ప్రైవేటు ఉద్యోగిగా, తల్లి గృహిణిగా ఉండేదని తెలిపారు. రెండవ సంతానం కూడా ఒక సంవత్సర కిందట రెండు నెలల బాబు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగిందని తెలిపారు. మేనరికం వివాహం జరిగిందని తెలిపారు. మొత్తం మీద ఈ కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు కుమారులను మృత్యువాత పడటం అందరినీ కలిసివేసింది. ఈ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు.