డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ.. డాక్టర్ సెల్వియా సా ల్మాన్
విశాలాంధ్ర ధర్మవరం సీజనల్ వ్యాధులపై ప్రజలకు పూర్తి దశలో అవగాహన కల్పించాలని డిప్యూటీ డి ఎం ఎల్ హెచ్ ఓ డాక్టర్ సేల్వియా సల్మాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా స్థానిక ఎన్జీవో హోం లో హెల్త్ డివిజన్లోని ధర్మవరం, తాడిమర్రి, ముదిగుబ్బ, చేనేకొత్తపల్లి ,రామగిరి, బత్తలపల్లి ల గల11 పీహెచ్సీలకు,6 యూపీహెచ్సీలకు అవగాహన శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం హరీష్ కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులపై ప్రతి ఉద్యోగి ప్రజలకు అవగాహన కల్పించుటలో సఫలీకృతులు కావాలని, అప్పుడే గ్రామ, పట్టణాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం డాక్టర్ సేల్వియా సల్మాన్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే గా పాటించాలని, నీరు నిల్వ లేకుండా చూడాలని, దోమకాటు ఆరోగ్యానికి చేటు అని, దోమ తెరలు వాడడం ద్వారా దోమ కాటును నివారించాలని, డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, బోధకాలు, మెదడు వాపు వ్యాధి రాకుండా అప్రమత్తంగా ప్రజలు ఉండే విధంగా కృషి చేయాలని తెలిపారు. మరేరియా సబ్ యూనిట్ కార్యాలయం ద్వారా సమన్వయంతో ఆరోగ్యం పట్ల ముందుకు వెళ్లాలని సూచించారు. వ్యాధుల నివారణ ఉత్తమ రక్షణగా ఉండాలని, అతిశారా వ్యాధి నుండి పిల్లలను రక్షించాలని, మలేరియా రహిత సమాజంగా చేయాలని, మలేరియా వ్యతిరేక పోరాటాన్ని వేగవంతం చేయాలని, విరోచనాల వల్ల కలిగే ప్రాణ నష్టాలని ఆపాలని, ఓ ఆర్ ఎస్ దక్షిణ జింక్ శక్తితో నీల విరోచనాలను మటుమాయం చేయవచ్చునని తెలిపారు. ఏ గ్రామంలో గాని, పట్టణంలో గాని ఆరోగ్య విషయాలపై ఫిర్యాదు అందితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి హెచ్ శీల మెడికల్, డాక్టర్లు ,యూపీహెచ్సీల మెడికల్ డాక్టర్లు, సబ్ యూనిట్ మలేరియా ఆఫీసర్ జయరాం నాయక్, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.