విశాలాంధ్ర ధర్మవరం:: పరిశిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరూ కొత్త యోగా సెంటర్లను ఏర్పాటు చేసి అందరికీ యోగా అందించే విధంగా కృషి చేయాలని కేశవ్ గురూజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సంజయ్ నగర్ లోని బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో యోగా ప్రశిక్షణ వర్గ కార్యక్రమం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తదుపరి యోగవర్గాలు యోగాసనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు యోగా ద్వారా తెరిపి నేర్పించబడుతున్న విషయాన్ని వారు అభ్యసన రూపంలో రుజువు చేశారు. ప్రముఖ యోగాచార్యులతో కూడా శిక్షణ ఇవ్వబడిందని తెలిపారు. యోగ పరిరక్షణ లో చలపతి, తిరుమలేష్, రామన్న, ఈశ్వరయ్య పాల్గొని యోగ విశిష్టతను తెలియజేశారు. ఈ ప్రశిక్షణ వర్గలో ప్రాంత సేవా ప్రముఖు కేశవయ్య గురూజీతోపాటు కుటుంబ సేవా ప్రముఖు చింతా మునిస్వామి గురూజీ, ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖు శుభ శేఖర్ గురూజీ పాల్గొన్నారు.