Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర – ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడమే ఎన్ డి ఏ యొక్క లక్ష్యము అని ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని 22వ వార్డులో మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల ను పంపిణీ చేశారు. అంతేకాకుండా వార్డుల నుండి ప్రజల ద్వారా అర్జీలను కూడా స్వీకరించడం జరిగింది. అనంతరం సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఆదరించి అధికారంలోకి తెచ్చారని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రజల కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని హామీలను నెరవేర్చి కూటమి ప్రభుత్వం ఏంటో నిరూపిస్తామని తెలిపారు. గత హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రజలపై ఆ భారం మోపబోమని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదరించడం జరిగిందని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి బాటలో నడుపుతామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడపాలంటే కొంతకాలం నిరీక్షణ చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు పెన్షన్ను ఆగస్టు 1వ తేదీ సాయంత్రం లోపే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ అందేలా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img