మంత్రి ముఖ్య అనుచరులు హామీ
విశాలాంధ్ర- ధర్మవరం;; పట్టణంలోని వరలక్ష్మి థియేటర్ వెనక ఉన్న ఇరిగేషన్ కెనాల్ ఎత్తును పెంచి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని మంత్రి సత్య కుమార్ యాదవ్ ముఖ్య అనుచరులు హరీష్ తదితరులు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల రెండు రోజులుగా వర్షం అధికంగా రావడంతో కాలువ చిన్నది కావడంతో కాలువలోని నీరు వర్షపు నీరు రోడ్డు పైకి రావడం, ప్రజలకు ఎన్నో ఇబ్బందులు కలిగాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ రామ్కుమార్ తో స్థలాన్ని వారు పరిశీలించారు. ఇక్కడ కాలువ చిన్నదిగా ఉండడంతో వర్షపు నీరు డ్రైనేజీ నీరు వీధిలోకి రావడం జరుగుతుందని, ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. గతంలోని ఎమ్మెల్యే కేతిరెడ్డి హయాంలో కాంట్రాక్టర్లు ఈ విధంగా చేయడం వల్లనే ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తెనాలి ఎత్తు వెడల్పు పెంచడానికి అవసరమైన మరమ్మత్తు అంచనాను సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ పరిశీలన హామీ పట్ల అక్కడి వార్డు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.