విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం చోడవరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అధ్యక్షుడు కలగర్ల శేషగిరిరావు ఆధ్వర్యంలో స్థానిక పత్రిక ప్రతినిధులు (విలేకరులను) పత్రిక దినోత్సవం (జర్నలిస్టు డే ) సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు చీమకుర్తి ప్రభాకర్ మాట్లాడుతూ క్లబ్ వ్యవస్థాపకుడు కె.సి. గుప్తా జన్మదినోత్సవం సందర్భంగా ప్రతీ ఏడాది క్లబ్ వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 1 నుండి ప్రారంభమైన వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం, వృద్ధాశ్రమానికి కిరాణా సరుకులు వితరణ, ఉషోదయ కాలేజి లో యువతకు సందేశం, విలేఖరులకు సన్మానం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ కల గర్ల శేషగిరిరావు వాసవి క్లబ్ కార్యదర్శి కలగర్ల అప్పల నరసింహమూర్తి వాసు, కోశాధికారి పసుమర్తి లక్ష్మణ, డిప్యూటీ గవర్నర్ శ్రీనాథ్ వెంకట మాధవ (మధు), ఆర్.సి. సతీష్, వనిత క్లబ్ అధ్యక్షులు ఉషశ్రీ, కార్యదర్శి జానకి, కోశాధికారి తులసి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, విటల్ రావు, నాగేశ్వరావు జోన్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.