కిటుముల సర్పంచ్ రమణమ్మ.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పెంచిన వైయస్సార్ పెన్షన్ పథకం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు వరమని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పథకాన్ని 3000 రూపాయలకు పెంచిన ఏకైక ప్రభుత్వం వైకాపా అని కిటుముల సర్పంచ్ గెమ్మేల రమణమ్మ అన్నారు. కిటుముల పంచాయతీ కేంద్రంలో వాలంటీర్లతో కలిసి ఆమె పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాలతో పాటు ప్రతి ఏటా 250 రూపాయలు చొప్పున పెన్షన్ ను పెంచుతూ నేడు మూడు వేల రూపాయలుగా తానిచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు 2024 లో జరగబోయే ఎన్నికల్లో వైకాపాను ఆశీర్వదించాలని, మరోమారు జగనన్నను మఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.