సంబంధిత శాఖ ఉన్నత అధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండల కేంద్రంలోని రామాలయం వీధిలో సకల దేవతల ఆలయ సమీపంలో గడచిన కొన్నేళ్ళ క్రితం కల్వర్టు నిర్మించారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా ఆ కల్వర్ట్ మధ్యలో రంద్రం ఏర్పడి ప్రమాదకరంగా తయారైంది. నిత్యం ఆ మార్గంలో వాహనాలు అధిక లోడుతో తిరుగుతూ ఉండటం వలన ఆ బరువుకు కల్వర్టు కుంగడంతో పాటు కల్వర్టు నడి మధ్యలో రంధ్రం ఏర్పడి వాహనదారులపై దాకా చూపరులకు సైతం భయం గొల్పుతుంది. రాత్రి సమయంలో అటుగా వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు రంధ్రాన్ని గమనించక ప్రమాదం భారిన పడే అవకాశాలు లేకపోలేదని ఈ ప్రాంతీయులు ఆందోళన చెందు తున్నారు. దీనిపై సంబంధిత ఉన్నత అధికారులు స్పందించి కల్వర్టు మధ్యలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చడం తో పాటు కుంగిన కల్వర్టు కు పూర్తి స్థాయి మరమత్తులు నిర్వహించాలని వాహనదారులు, పాదచారులు, ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.