పాడేరు నియోజకవర్గ శాసన సభ్యునిగా ఎన్నికైన విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గ శాసనసభ స్థానం నుంచి నూతన శాసన సభ్యునిగా వైకాపా నుంచి ఎన్నికైన మత్యరాస విశ్వేశ్వర రాజు కు శుభాకాంక్షలు వెళ్లువెత్తు తున్నాయి. బెన్నవరం, లోతుగెడ్డ పంచాయతీ లకు చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు శనివారం ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పాడేరు శాసన సభ్యునిగా నూతనంగా ఎన్నికైన విశ్వేశ్వర రాజు ను కలిసిన వారిలో బెన్న వరం, లోతు గెడ్డ సచివాలయం కన్వీనర్లు బచ్చల బొజ్జొన్న దొర, శ్రీరాములు, పాత్రికేయుడు ప్రసాద్, జోసెఫ్, అధిక సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.