Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అవస్థలకు ప్రతిరూపం.. అంజలి శనివారం రహదారి

తరాలు మారుతున్న సరైన రహదారికి నోచుకోని ప్రజలు

రాష్ట్రంలోనే సిపిఐ పార్టీ విజయం సాధించిన ఏకైక పంచాయతీ

సర్పంచ్ రాజబాబు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తరాలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు మారుతున్నా, అంజలి శనివారం పంచాయతీ రహదారి వ్యవస్థ లో మార్పు రావడం లేదని సిపిఐ పార్టీకి చెందిన ఆ పంచాయతీ సర్పంచ్ పేట్ల రాజబాబు అన్నారు. ఆ పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజులతో కలిసి మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో మారుమూల పంచాయతీ అయిన అంజలి శనివారం పంచాయతీ చరిత్ర కలిగిన పంచాయతీ అన్నారు. ఎంతోమంది పాలకులు, అధికారులు, తరాలు మారిన తమ పంచాయితీకి సరైన రహదారి నిర్మాణం చేపట్టలేకపోయారన్నారు. విజయం సాధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు రహదారి నిర్మాణానికి కృషి చేస్తున్నామని ప్రకటనలు గుప్పించడం తప్ప పూర్తిస్థాయిలో రహదారి నిర్మాణానికి ఏ ఒక్కరూ కృషి చేయలేదన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో బిజెపి, తెదేపా, కాంగ్రెస్, వైకాపాలు పరిపాలన సాగించినప్పటికీ తమ పంచాయతీలో సర్పంచ్ స్థానాన్ని సిపిఐ పార్టీ దక్కించుకుని చరిత్రలో నిలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్రాలలో తమ ప్రభుత్వం లేనందున మిగిలిన పార్టీలన్నీ ఈ రహదారి నిర్మాణం విషయంలో మీనమేసాలు లెక్కిస్తున్నాయన్నరు. ఎంపీ, ఎమ్మెల్యే వంటి సార్వత్రిక ఎన్నికలలోనూ తమ పంచాయితీ ప్రజలు ఓట్లు వేశారన్న విషయాన్ని పాలకులు విస్మరిస్తున్నారన్నారు. స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు పూర్తి కావస్తున్నా తమ పంచాయితీకి చెందిన ప్రధాన రహదారి పూర్తి కాలేదంటే పాలకుల పనితీరును ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలోనే గాక మిగిలిన కాలాల్లోనూ రహదారి సమస్యతో తమ పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి అంజలి శనివారం పంచాయతీ ప్రధాన రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img