తెదేపా పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ రాష్ట్ర ప్రజలకు తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించే రక్ష అని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పలు వీధులలో గురువారం బాబు షూరిటీ.. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలను నమ్మబలికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రజలకు సంక్షేమం ముసుగేసి సర్వం దోచేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. మరోమారు అవకాశం కల్పించాలంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పి కొట్టేందుకు అనుభవిజ్ఞుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తో సూపర్ సిక్స్ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని ఈ సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలకు రక్షణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, సేవ ఈశ్వరమ్మ ,బేతా నూక రత్నం, బూత్ కన్వీనర్ బేతా నాగు, మంగ్లు, సుబ్బారావు పెద్ద, అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.