తల్లితండ్రులు లేని విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ చేసిన చేయూత వారియర్స్ ట్రస్ట్.
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వస్త్రాలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చేయూత వారియర్స్ ట్రస్ట్ చైర్మన్ దూనబోయిన రమణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఆశ్రమ వసతి గృహ పాఠశాలలో తల్లితండ్రులు లేని 17 మంది విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొండలరావు ఆధ్వర్యంలో వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ వస్త్రాల పంపిణీ కార్యక్రమం దాతల సహాయ, సహకారాలతో చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఇండుగ శేఖర్, షేక్ ఉమర్, గంగల శివ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.