సాడీ పేటలో బోరు బావిలో నీరు రాక ఇబ్బంది పడుతున్న మహిళలు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : -వేసవికాలం రాకముందే మండల కేంద్రంలో త్రాగునీటి సమస్య తీవ్ర రూపం దాలిస్తుంది. మండల కేంద్రంలోని బోర్లు ద్వారా ప్రజలకు దాహార్తిని తీర్చే త్రాగునీటి సమస్యకు పాలకులు, అధికారులు ఇప్పటినుంచే చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడనుంది. బోర్ బావులలో ఇప్పటికే త్రాగునీరు రాకపోవడంతో మహిళలు త్రాగునీటి కోసం అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు. రాబోవు వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటిపారుదల శాఖ అధికారులు బోరుబావుల మరమ్మత్తు పనులు చేపట్టి త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సాడిపేటకు చెందిన మహిళలు ప్రజా ప్రతినిధులు, పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.