Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

అంగన్వాడీలకు భోజన వితరణ

భోజన వితరణ చేసిన తెదేపా గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆనందరావు, వరహాలమ్మ దంపతులు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై గడచిన 28 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఆ పార్టీ చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై గడచిన 28 రోజులుగా రోడ్లపై నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ఈ వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో అంగన్వాడీలను పట్టించుకోకపోవడంతో ఇతర పార్టీలు రాజకీయ నాయకులు పలు సంఘాల ఉద్యోగులు అంగన్వాడీలకు సంఘీభావం తెలుపుతున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిరోజు వివిధ మారుమూల గ్రామాల నుంచి వచ్చి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీలకు భోజన వితరణ చేయాలన్న సదుద్దేశంతో స్థానిక తెదేపా నాయకుడు ఆనందరావు, వరహాలమ్మ దంపతులు సోమవారం సుమారు 300కు పైగా ఉన్న అంగన్వాడీలకు భోజన వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఎల్లప్పుడూ సేవ చేస్తున్న అంగన్వాడీలకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీను మరవడంతో ఆ హామీని నిలబెట్టుకోవాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను అనగదొక్కాలనే వైకాపా ప్రభుత్వ విధానాల వల్లనే అంగన్వాడీలు సుమారు 28 రోజులుగా రోడ్లపైకి రావడం జరిగిందని ఇటువంటి పరిస్థితిని కల్పించిన వైకాపాను గద్దే దింపే సమయం దగ్గరలోనే ఉందని వారు జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు బోనంగి చిన్నయ్య పడాల్, పాంగి ధనుంజయ్, తెదేపా పంచాయతీ వార్డు సభ్యురాలు రీమల ఝాన్సీ రాణి, తెదేపా నాయకురాలు స్వర్ణ, బూత్ కన్వీనర్లు అరుగుల అనిల్ కుమార్, ముత్యం సత్యనారాయణ, కొర్ర గోవింద్, చిందాడ సాయి ఆనందరావు కుటుంబ సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img