Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

పిల్లల్ని పెంచుకునేందుకు పెన్షన్ ఇప్పించండి

గిరి మహిళ అభ్యర్ధన

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మద్యానికి బానిసైన భర్త మరణంతో నలుగురు పిల్లలు కలిగిన తన పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని మండలంలోని లోతు గెడ్డ పంచాయతీ పిసిరిమామిడి గ్రామస్తురాలు గెమ్మేల సీత అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ పిసిరి మామిడి గ్రామస్తురాలినైన తనకు నలుగురు సంతానమని, సజావుగా సాగుతున్న తమ జీవితంలో నాటుసారా మహమ్మారి చిచ్చు రేపిందని, నాటు సారాకు బానిసైన తన భర్త మరణంతో కుటుంబ భారం తనపై పడిందన్నారు. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నానన్నారు. అతి కష్టం మీద పిల్లలను చదివించుకోవలసిన పరిస్థితి ఎదురైందన్నారు. ఈ క్రమంలో కూలి పని చేసుకుంటూ పెద్ద కుమారుడ్ని బీ ఫార్మసీ చదివించుకున్నానని, తీరా ఆ కోర్స్ పూర్తి చేసినప్పటికీ ఆ కళాశాలకు చెల్లించవలసిన సుమారు 50 వేల రూపాయల ఫీజు చెల్లించని కారణంగా ధ్రువీకరణ పత్రాలను కళాశాల యాజమాన్యం తమ దగ్గరే పెట్టుకుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భర్త మరణించి మూడేళ్లు కావస్తున్న తనకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదని, కూలి పని చేసుకుని నలుగురు పెళ్ళాలను పోషించుకునే తాను 50 వేల రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చి చెల్లించగలనని ఆమె కన్నీటి పర్యంతమైంది. ఇటువంటి ఆర్థిక పరిస్థితులలో మిగిలిన ముగ్గురు పిల్లలను చదివించుకోవడం భారంగా ఉందని, కుటుంబ పోషణతోపాటు పిల్లల చదువులకు తనకు ఆర్థిక స్తోమత లేదని కనుక బి ఫార్మసీ పూర్తి చేసిన తన పెద్ద కుమారుడైన యేసు రత్నం ఉత్తీర్ణత సాధించిన ధ్రువీకరణ పత్రాలను కళాశాల యాజమాన్యంతో మాట్లాడి ఇప్పించడంతోపాటు, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా తన వద్దనున్న మిగిలిన ముగ్గురు బిడ్డలతో ఆమె అభ్యర్థిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img