భారతీయ విద్యా కేంద్రం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్.
విశాలాంధ్ర – చింతపల్లి ( అల్లూరి సీతారామరాజు జిల్లా) : – స్థానిక భారతీయ విద్యా కేంద్రం పాఠశాల 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ భారతీయ విద్యా కేంద్రం చింతపల్లి లో ఏర్పాటు చేసి 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం పాఠశాలలో నిర్వహించు 12వ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమానికి అల్లూరి జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు, ముఖ్యఅతిథిగా హాజరుకానున్నరని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జి మోహన్, కార్యదర్శి వి రామ సత్యనారాయణ, గిరిజన ఉద్యోగుల సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షుడు ఎం శేషాద్రి లు హాజరుకానున్నారని, ఈ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.