Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైకాపా ప్రభుత్వ అధికారంలోకి రావాలి

వైకాపా మండల కన్వీనర్ గుణబాబు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ పార్టీ మండల కన్వీనర్ పాంగి గుణ బాబు అన్నారు. మండలంలోని కొమ్మంగి, ఎర్రబొమ్మల పంచాయతీ లలో వైకాపా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలు పథకాలను వివరిస్తూ సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ వైకాపా విజయానికై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులతో కలిసి ప్రసారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఐదేళ్లపాటు వైకాపా ప్రభుత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దన్నారు. 76 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ రాజకీయ పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందించిన ఏకైక ప్రభుత్వం వైకాపా అన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మరలా ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎర్ర బొమ్మల సర్పంచ్ లోతా పండయ్య, కొమ్మంగి ఎంపీటీసీ సభ్యురాలు రూతు, పెద్ద బరడ, గొంది పాకల ఎంపీటీసీ సభ్యులు పొట్టిక లోవరాజు, తాంబేలి మోహన్ రావు, పెదబరడ మాజీ సర్పంచ్ బోయిన సత్యారాయణ, నాయకులు పోటుకురి బెన్నస్వామి, రాసునాయుడు, అప్పన బాలరాజు బొబ్బిలి చిన్న లకే సత్యనారాయణ, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img