Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఆచూకీ కనుగొందాం

ఎస్సై అరుణ్ కిరణ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఈనెల 13న మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలురు తప్పిపోయినట్లు వారి తల్లిదండ్రుల నుండి ఫిర్యాదు అందిందని చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ ఫోటోలోని ఇద్దరు పిల్లలు గత 13న శనివారం నుంచి కనబడటం లేదని ఫిర్యాదు అందిందని, తప్పిపోయిన పిల్లలు చింతపల్లి మండలం, బౌడ గ్రామానికి చెందిన పాంగి సత్తిబాబు కుమారుడు పాంగి సాయి, మరొక బాలుడు ఇదే మండలానికి చెందిన గానుగులపాడు గ్రామానికి చెందిన కిల్లో సత్తిబాబు కుమారుడు కిల్లో దినేశ్ అని తెలిపారు. ఈ బాలల ఆచూకీ తెలిసినవారు చింతపల్లి పోలీస్ వారికి సమాచారం అందించాలని, బాలలిద్దరు తప్పిపోయినప్పుడు ఏ దుస్తులతో ఉన్నారో ఈ ఫోటోలో ఉన్న అవే దుస్తులతోనే ఉన్నారని అన్నారు. వీరి ఆచూకీ తెలిసినవారు చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్ 9440904238 కు గాని,
సర్కిల్ ఇన్స్పెక్టర్ 9440904239 కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img