కొమ్మంగి ఎంపీటీసీ సభ్యురాలు రూతు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- అరకు పార్లమెంట్ సమన్వయకర్త పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చింతపల్లి మండల పర్యటన ను జయప్రదం చేయాలని వైకాపా కొమ్మంగి పంచాయతీ ఎంపిటిసి సభ్యురాలు జర్త రూతు అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మండలంలోని కొమ్మంగి పంచాయతీ లోని జర్రి గొంది, లబ్బు గుంట గ్రామాలలో 80 లక్షలు రూపాయల నిధులతో నిర్మించిన సిమెంటు రహదారుల పనులకు గురువారం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేయనున్నారని, అదే క్రమంలో మధ్యాహ్నం.02. గంటలకు చింతపల్లి ఎంపీ డివో కార్యాలయ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో. ముఖ్యఅతిథిగా పాల్గొని అవార్డులకు ఎంపికైన వాలంటీర్లకు పురస్కారాలను అందజేయనున్నారని ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె కోరారు.