ఈ నెల 17, 18 తేదీలలో కోటి లింగేశ్వర స్వామి ఉత్సవం
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఈనెల 17, 18 తేదీలలో బలపం కోరుకొండలో నిర్వహించ తలపెట్టిన కోటిలింగేశ్వర స్వామి తీర్థ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. ఎం ఎస్ ఈవెంట్స్, డీజే సెట్టింగులతో ఆది, సోమవారాలలో రెండు రోజులు పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి ఈ తీర్ధ మహోత్సవానికి అశేష భక్తజనం హాజరై ఉత్సవాన్ని జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.