Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

రోగులను, క్షతగాత్రులను అత్యవసర పరిస్థితుల్లోనే మైదాన ప్రాంతాలకు సిఫార్సు చేయండి

చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- రోగులను, క్షతగాత్రులను అత్యవసర పరిస్థితులలోనే మైదాన ప్రాంతాలకు తరలించాలి తప్ప ప్రతిదాన్ని మైదాన ప్రాంతాలకు సిఫార్సు చేయవద్దని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. సమీక్ష సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆమె సమావేశంలో భాగంగా ప్రాంతీయ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై, జరగాల్సిన అభివృద్ధి పనులపై కమిటీ సభ్యులతో కూలంకశంగా చర్చించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆమె ఆసుపత్రికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు అనునిత్యం అందుబాటులో ఉండాలని, వివిధ రుగ్మతలతో ఆసుపత్రికి వచ్చే రోగులు, క్షతగాత్రులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి సిబ్బంది పై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వైద్యులను ఆదేశించారు. వివిధ ప్రమాదాలతో వచ్చిన క్షతగాత్రులను, దీర్ఘకాలిక వ్యాధులతో వచ్చిన రోగులను పూర్తిస్థాయిలో పరిశీలించి అత్యవసరమనుకుంటేనే మెరుగైన వైద్యానికి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు సిపార్సు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, ఎంపీటీసీ సభ్యురాలు దాసరి దారలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడు సలిమితి లక్ష్మయ్య, వైకాపా మండల కన్వీనర్ పాంగి గుణబాబు, జీకే వీధి, కొయ్యూరు ఎంపీపీలు బోయిన కుమారి, రమేష్, మండల అధ్యక్షుడు రవి, నాయకులు బోండా సింహాచలం, మోహన్ రావు, దాసరి మత్యరాజు, కంకిపాటి వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img