మజీద్ కమిటీ అధ్యక్షులు షేక్ మీరాలు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మతసామరస్యానికి అతీతంగా దేశవ్యాప్తంగా నిర్వహించే గణతంత్ర వేడుకలను స్థానిక మజీద్ వద్ద ముస్లింలు ఘనంగా నిర్వహించారు. 75వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక మజీద్ ఇమామ్ మహమ్మద్ ముజీబ్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి లతో కలసి ముస్లిం సోదరులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితమే ప్రస్తుత దేశ ప్రజల స్వేచ్ఛ జీవితమన్నారు. కుల, మతాలకతీతంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడం ప్రతి ఒక్కరూ కర్తవ్యం గా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు షేక్ ఖాసిం వల్లి, షేక్ సత్తార్, షేక్ రహిమాన్, షేక్ నూరు బాబు, షేక్ దర్గా, షేక్ రెహ్మాన్ (గౌతమ్), షేక్ వల్లి, షేక్ సత్తార్ (చంటి), షేక్ రెహమాన్ (మంగీలాల్), చిన్నారులు పాల్గొన్న