విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- స్వచ్ఛ గ్రామమే లక్ష్యంగా గిరిజనులు శ్రమదానానికి ఉపక్రమించారు. కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామస్తులంతా కలిసి గ్రామ పరిసరాలను పరిశుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొలపరి గ్రామ పెద్ద, వార్డు సభ్యుడు రాజారావు అధ్యక్షతన వాలంటీర్.మర్రి కమల లు స్వచ్ఛ చ్ఛభారత్ నిర్వహించి పరిసరాలు పరిశుభ్రం చేసుకున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామానికి తరలివచ్చే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు స్వగ్రామం స్వాగతం పలకనుంది. ఈ సందర్భంగా వార్డు సభ్యుడు రాజారావు మాట్లాడుతూ స్వచ్ఛ గ్రామాలే సాకారంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, తదనుగుణంగా గ్రామస్తులంతా ఐకమత్యంతో శ్రమదానం చేసుకుంటే గ్రామాలు బాగుపడడమే గాక ప్రతి ఒక్కరికి మెరుగైన ఆరోగ్యం ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.