Monday, May 20, 2024
Monday, May 20, 2024

శిలాఫలకాలు కూల్చివేయడం పిరికిపంద చర్య

జడ్పిటిసి బాలయ్య, ఎంపీపీ అనూష దేవి.

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – అభివృద్ధి పనులకు సంబంధించి నిర్మించిన వైకాపా శిలాఫలకాలను కూల్చివేయడం పిరికిపంద చర్య అని జడ్పిటిసి పోతురాజు బాలయ్య, ఎంపీపీ కోరాబు అనూష దేవి అన్నారు. గొందిపాకలు పంచాయతీ చిక్కుడు బట్టి గ్రామంలో రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేసిన విషయాన్ని తెలుసుకుని ఆ పంచాయతీ ఎంపీటీసీ సభ్యుడు తాంబేలి మోహన్ రావుతో కలిసి అక్కడకు చేరుకున్న వారు సంఘటానాస్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిలాఫలకాలు కూల్చివేయడం పిరికి పంద చర్య అన్నారు. ఈ కూల్చివేతకు బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలేదిలేదనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి చర్యలు పునరావ్రత్తం కాకుండా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఇది ముమ్మాటికీ తెలుగుదేశం గూండాలు చేసిన పనేననీ వారిపై పిర్యాదు చేస్తామన్నారు.ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం వారికి అలవాటన్నారు. ప్రసాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇలాంటి చర్యలు వలన శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఇలాంటి చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ బెన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img