ఎంపీటీసీ దాసరి దారలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండల కేంద్రంలో మరమ్మతులకు గురైన త్రాగునీటి బోర్ లను రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మరమ్మత్తులు నిర్వహించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చింతపల్లి 1 ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మీ అన్నారు. స్థానిక మండల షేక్ నాజర్ వల్లి తో కలిసి గ్రామంలో మరమ్మలకు గురైన త్రాగునీటి బోర్ లను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోవు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని తన పరిధిలోని త్రాగునీటి బోర్ ల పనితీరును పరిశీలించడం జరిగిందని, మరమ్మతులకు గురైన మూడు బోర్లను గుర్తించడం జరిగింది అన్నారు. వాటిని మరమ్మత్తులు నిర్వహించి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు, వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడడమే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఎంపీపీ అనూష దేవి, స్థానిక సర్పంచ్ పుష్పలత ల సహకారంతో కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.