Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సమిష్టి కృషి సత్ఫలితాన్ని ఇచ్చింది

వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాకర్

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికలలో వైకాపా శ్రేణుల సమిష్టి కృషి సత్ఫలితాన్ని ఇచ్చిందని వైకాపా ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ అన్నారు. పాడేరు నియోజకవర్గం లో మత్స్యరాస విశ్వేశ్వర రాజు విజయం సాధించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ ఎస్ టి సెల్ అల్లూరి జిల్లా అధ్యక్షుడు, జీకే వీధి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, కార్యదర్శి వంతల బాబురావు, సర్పంచ్ల ఫోరం జీకే వీధి మండల అధ్యక్షుడు కే రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ జల్లి హలియా రాణి లతో కలిసి ఆయన కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గిరిజన జాతి పూర్తి మద్దతుగా నిలిచిందన్నారు. పాడేరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు తన సమీప ప్రత్యర్థి ఎన్డీఏ కూటమి తెదేపాకు చెందిన గిడ్డి ఈశ్వరి పై 19 వేలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం సంతోషకరమన్నారు. కేవలం చింతపల్లి మండలంలోని వైకాపాకు ఏడు వేలకు పైగా మెజార్టీ వచ్చిందన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మిగిలిన నాలుగు మండలాల కన్నా చింతపల్లిలోనే 7వేల పైచిలుకు మెజార్టీ రావడం సమిష్టి కృషివలనే సాధ్యమైందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పాడేరు తోపాటు అరకు శాసనసభ, పార్లమెంటు స్థానాలలోను వైకాపా విజయ దుందుభి మోగించడం మన్యవాసులకు వైకాపా పై ఉన్న నమ్మకానికి నిదర్శనం అన్నారు. మన్యంలో ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశ్వేశ్వర రాజు విజయానికి సమిష్టిగా కృషి చేయడం శుభ పరిణామం అన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలకు కారణాలను వెతుక్కుని రాబోవు రోజులలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించుకుని ప్రజల పక్షాన ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో జికే వీధి మండల వైస్ ఎంపీపీ చప్పగడ్డ ఆనంద్, చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరకు ఇర్మియ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img