పిడుగుపాటు శబ్దానికి ధ్వంసమైన విద్యుత్ మీటర్
బాధితుడు మోహన్ రావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మండలంలోని అంతర్ల గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి పిడుగు పాటుకు ఇంట్లో నిద్రిస్తున్న బాలిక కోరాబు హారికకు స్వల్ప గాయం అయింది. అదే క్రమంలో విద్యుత్ మీటర్, విద్యుత్తు బోర్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఇంటి యజమాని కోరాబు మోహన్ రావు తెలిపారు. ఈ పిడుగుపాటు కారణంగా భయాందోళనకు గురయ్యామని, త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని మోహన్ రావు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.