Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వాలు మార్పు తప్ప.. రహదారి మార్పు చూడగలమా…

అనుమానం వ్యక్తం చేస్తున్న అంజలి శనివారం పంచాయతీ నాయకులు పోతురాజు వెంగళరావు

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రభుత్వాలలో మార్పు తప్ప మా అంజలి శనివారం పంచాయతీ రహదారి అభివృద్ధిలో మార్పు కనిపించడం లేదని ఆ పంచాయతీ మాజీ ఎంపీటీసీ సభ్యుడు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి పేట్ల పోతురాజు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యుడు, వైస్ ఎంపీపీ సాగిన వెంగళరావు లు అన్నారు. బుధవారం చింతపల్లి వచ్చిన వారు స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న ఎంతమంది అధికారులు వచ్చి పోతున్న అంజలి శనివారం పంచాయతీ రహదారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేక పర్యాయాలు ఈ రహదారి పూర్తి చేసేందుకు శంకుస్థాపనలు చేశారే తప్ప రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయారన్నారు. కిటుముల పంచాయతీ జాజులపాలెం వరకు తారు రోడ్డు నిర్మాణం జరిగినప్పటికీ అక్కడ నుండి అంజలి శనివారం వరకు రహదారి అధ్వాన్నంగా ఉంటుందన్నారు. ఈ రహదారిని తారు రోడ్డుగా మలచేందుకు ప్రయత్నించినప్పటికీ అనివార్య కారణాల వలన నిర్మాణం పూర్తి కావడం లేదని, ప్రతి ఏటా వర్షాకాలంలోనే గాక ఇతర కాలాల్లోనూ ఈ రహదారి గుండా ప్రయాణించేందుకు వాహన చోదకులు ప్రయాణికులు అష్ట కష్టాలు పడవలసిన పరిస్థితి ఉందన్నారు. వర్షాకాలంలో అయితే రహదారి కోతకు గురై ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లలో అంజలి శనివారం పంచాయతీ కేంద్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదంటే అతిశయోక్తి కాదన్నారు. వందేళ్ల స్వాతంత్ర్య చరిత్ర లోనైనా తమ పంచాయతీ కి తారు రోడ్డు రహదారి నిర్మాణం జరిగి ఆర్టీసీ సౌకర్యం అందుబాటులోకి వస్తుందా అనే అనుమానం కలుగుతుందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలలో ఉన్న కూటమి ప్రభుత్వాలు సంయుక్తంగా ఆలోచన చేసి అంజలి శనివారం పంచాయతీకి తారు రోడ్డు రహదారి నిర్మాణ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img