విశాలాంధ్ర – చోడవరం/బుచ్చయ్యపేట( అనకాపల్లి జిల్లా) : మండల కేంద్రమైన బుచ్చయ్యపేట గ్రామంలో తాటికొండ అచ్చం నాయుడు (39) అనే వ్యక్తిని గన్రెడ్డి శ్రీను అనే వ్యక్తి పొలానికి వెళుతుండగా బుదవారం ఉదయం 5 గంటల సమయం లో కత్తితో దాడి చేసి, చంపేశాడు. మెడ భాగంపై కత్తితో నరకడంతో ఘటనా స్థలంలోని అచ్చం నాయుడు మృతి చెందాడు.
వీరిద్దరూ రాత్రి ఏదో విషయమై గొడవ పడ్డారని అని తెలిసింది. చంపడానికి గల కారణాలు తెలియవలసి ఉన్నది. దీనిపై బుచ్చయ్య పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.