– సంఘం జిల్లా అధ్యక్షులు డి. రవికుమార్
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 05.03.2024ది.దివ్యాంగుల న్యాయమైన కోర్కెల సాధనకు ఈ నెల 9 న అమరావతిలో జరుపనున్న ‘వికలాంగుల మహగర్జన ‘ జయప్రదం చేయాలని ధివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుగ్గిరాల రవి కుమార్ కోరారు. స్థానిక అంబేద్కర్ భవనంలో మంగళవారం ఉదయం నిర్వహించిన దుగ్గిరాల రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు ఫించన్ రూ.6,000లు పెంచాలని, న్యాయమైన హక్కులు పరిష్కారం కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. అనంతరం ” ఛలో అమరావతి” కరపత్ర0 ఆవిష్కరించారు. దివ్యాంగ సహోదరి, సహోదరులు ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సింగంపల్లి అనంతరావు, ఉపాధ్యక్షుడు జరగడం నాగభూషణ రావు, మాదిగ ఉద్యోగుల సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి. మూర్తా శ్రీనివాసరావు,
కoడేoల్లి వెంకట్రావు, సీనియర్ నాయకుడు అత్తోటి వజ్రబూషణం, మాది ఉద్యోగాల సంఘం జిల్లా సీనియర్ నాయకులు యర్రంశెట్టి వరప్రసాద్(రెల్లి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు యర్రం శెట్టి వరప్రసాదరావు, సీనియర్ నాయకుడు వడ్డాది చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.