ఏ.పి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.07.03.2024ది. అనకాపల్లి జిల్లా పర్యటనకు రానున్న సి.ఎం.దృష్టికి రైతాంగం సమస్యలను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా చోడవరం పోలీసులు అక్రమ అరెస్ట్ లతో గృహ నిర్భంధం చేయడం అన్యాయమని ఏ.పి.రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు తెలిపారు. దీనిపై రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ ఏ.పి. సి.ఎం. జగన్మోహన్ రెడ్డి సమావేశం సందర్భంగా బుదవారం అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారని, కార్మిక, కర్షక, ప్రజా కమ్యూనిస్టు సంఘాల పట్ల నిరంతరం భయపడుతూ సమావేశాలు జరుపుకుంటన్నారు అన్నారు. ప్రజా సంఘాలు గొంతు నొక్కి, అధికార పార్టీ కార్యకలాపాలు నెరవేర్చుకోవాలని ఉద్దేశంతో అరెస్టులు చేయడం సరైనది కాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలపై గళమెత్తి మాట్లాడే హక్కును ప్రజలకు కల్పించబడింది అని తెలిపారు. ప్రజా సమస్యల పై ప్రశ్నించే వారిని పోలీసులు చేత అరెస్టు చేయించడం ముఖ్యమంత్రి చేతకానితనము అని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమనాథన్ కమిషన్ జ2 ం 50 మద్దతు ధర ప్రకటించాలని,
కేరళ మాదిరిగా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని గురువారం నాటి సమావేశంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించాలని, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు .
అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని తెలియజేసారు.