– ఏ.పి. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బూసి పరమేశ్వరి….
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.07.03.2024ది. అధికార ప్రభుత్వం ఆదాయం కోసం భారీ స్థాయిలో మధ్యం అమ్మకాలు పెంచడంతో, ప్రజలు మత్తులో పెట్రేగి పోతున్నారని, కామాంధులు మహిళల మాన ప్రాణాలను హరిస్తున్నారని ఏ.పి.మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బూసి
జగన్ పాలనలో మహిళలకు రక్షణ కరువై దిక్కుతోచని స్థితికి నెట్టబడ్డారని, ఏపి మహిళ సమాఖ్య అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు బూసి పరమేశ్వరి ఆవేదన వ్యక్తంచేశారు.
114 వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను పురస్కరించుకుని గురువారం చోడవరంలో ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య అనకాపల్లి జిల్లా సహాయ కార్యదర్శి కనక మహాలక్ష్మి మాట్లాడుతూ అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో బూటకపు వాగ్దానాలతో మహిళా ఓటర్లను వంచించి గద్దెనెక్కి దుష్ట పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
బిజెపి పంచన చేరిన బాబుకు, దుష్ట పాలన చేసిన జగన్ కు ఆంధ్ర రాష్ట్ర0లో మహిళలను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమానికి మహిళా సమాఖ్య, సభ్యులు పాల్గొన్నారు.