విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే26.03.2024ది. బాల్య వివాహాలు భ్రూణ హత్యలు అత్యంత నేరమని రావికమతం ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు అధికారిని జి.ఉషారాణి తెలిపారు. అనకాపల్లి జిల్లా, చోడవరం మండలంలోని గవరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం భేటీ బచావో, బేటి పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ.సి.డి.ఎస్. పి.ఓ. ఉషారాణి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండే వరకు వివాహాలు చేయరాదని, బాల్య వివాహాలు నేరమన్నారు. అంతేగాక చిన్న వయసులో పెళ్లి చేయడం వలన అనేక ఆరోగ్య,రక్త హీనత తదితర సమస్యలు తలెత్తుతాయని తెలియజేశారు. అలాగే గర్భిణీలు స్కానింగ్ చేయించినప్పుడు ఆడబిడ్డ అని తెలియగానే అబార్షన్ చేయించి, భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, ఇది చాలా నేరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ.సీ.డి.వో ఎస్.పుష్ప దేవి, సూపర్వైజర్లు డి. శ్రీదేవి, ఎస్.అనిత, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, తదితరులు పాల్గొన్నారు.