-తాజాగా టిడిపికి చెందిన 20 కుటుంబాలు వైసీపీలో చేరిక….
విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే. 20.03.2024ది. సార్వత్రిక ఎన్నికలు
సమీపిస్తున్న తరుణంలో అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో వై.ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన జనసేన, టి.డి.పి కార్యకర్తలు వై.సీ.పీ.లో చేరగా, తాజాగా బుధవారం గుడ్డిప, కోయిలాపల్లి చెందిన సుమారు 20 టి.డి.పి. కుటుంబాలు స్థానిక వై.ఎస్సార్.సి.పి.కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో వైసీపీలో చేరారు. వారందరిని ఎమ్మెల్యే సాధరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి అభినందించారు. పార్టీలో చేరిన వారిలో గళ్ళ లీలా ప్రసాద్, సోములు సంజీవ్, పెద్దాడ కల్యాణం, అధికార రాజు, విస్సారపు అర్జున, కే. సత్యారావు, ఉప్పులూరు రాము, సోలాపు విస్సన్నరాజు, సీతా పోతురాజు, కంచిపాటి నాయుడు, పెద్దాడ రాజు నాయుడు, ఉప్పులూరు హరిబాబు, పెద్దాడ దేవుళ్ళు తదితర కుటుంబాలు వారు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూస్తుందని, ఈసారి కూడా తమ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని, ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తు0డంటంతో పాటు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ అందరికీ అందుబాటులో ఉంటూ, గతంలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. అందుకే ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న ఎన్నికల్లో వైసిపి విజయానికి కృషి చేసి గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ధర్మ శ్రీ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. అందుకే మరల రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావాలని అందుకు మిగతా పాటు మీ గ్రామాల్లో గల ప్రతి ఒక్కరు వైసీపీకి అండగా నిలిచేటట్టు కృషి చేయాలన్నారు.