విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.01.04.2024ది. గ్రామ, వార్డు సచివాలయాల వద్దనే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంభందించి సామాజిక భద్రత ఫించన్లు పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సి.ఈ.ఓ. మురళీధర్ రెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఆధార్, బయోమెట్రిక్, ఐరిష్ ద్వారా సచివాలయ ఉద్యోగులు ఫించన్లు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవి విఫలమైతే రియల్ టైమ్ బెనిఫెషరీ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఆర్.బి.ఐ.ఎస్) ద్వారా అందిస్తారని తెలిపారు.