విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.23.05.2024ది. మనిషి జీవితంలో చివరి మజిలీ శ్మశాన వాటిక అభివృద్ధికి నేను సైతం…. అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ అనకాపల్లి జిల్లా సమితి సభ్యుడు, ఏ.పి.రైతు సంఘం ఉపాధ్యక్షుడు అయిన రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో చోడవరం స్మశాన వాటిక గోడకి పెయింటింగ్ వేయిస్తున్నారు. చోడవరం నుండి అంకుపాలెం వెళ్లే దారిలో ఉన్న స్మశానం అభివృద్ధికి భారత్ కమ్యూనిస్టు పార్టీ చోడవరం ఆధ్వర్యంలో దాతలు ఇచ్చిన విరాళాలు, స్వంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని వారు తెలియజేసారు. సి.పి.ఐ.، అనకాపల్లి జిల్లా కార్మికుల సభ్యుడు రెడ్డిపల్లి ఆధ్వర్యంలో చోడవరం స్మశాన ప్రహరీ గోడకు పెయింటింగ్ వేయిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నేమాల నరసింగరావు, ద్వారపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.