విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.23.05.2024ది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వారు భారత్ స్కౌట్స్ గైడ్స్ సంస్థలో శిక్షణకు 18 సంవత్సరముల నుండి 40 సంవత్సరములలోపు ఉన్న యువతి యువకులకు యువ ఆపద మిత్ర అను పధకమును ప్రవేశపెట్టియున్నారని అనకాపల్లి జిల్లా కార్యదర్శి, స్టేట్ కోఆర్డినేటర్ కొణతాల రత్నకుమారి తెలిపారు. సమీప ప్రాంతములలో ప్రకృతి వైపరీత్యాలు వరదలు, భూకంపాలు, సునామీ వంటివి సంబవించినప్పుడు జాతీయ విపత్త్తు నిర్వహణ సంస్థతో పాటు సహాయము చేయుట కొరకు జాతీయ విఫత్తు నిర్వహణ సంస్థ వారు ఆశక్తి కల యువతి యువకులకు 7 రోజులు పాటు శిక్షణ శిబిరమును నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు షరీఫ్ ఫోన్ నెంబర్ 990818696 సంప్రదించాలన్నారు.